మల్కాజిగిరి గౌతమ్నగర్లో గురువారం గుట్ట పైనుంచి పెద్ద బండరాయి జారి పడింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఈదురుగాలులు, జల్లులతో బండ కింద మట్టి కరిగి జారిపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అది అమాంతం పక్కనే రోడ్డుపై ఉన్న మున్సిపల్ఆటోపై పడడంతో.. ఆ వాహనం నుజ్జునుజ్జయింది. సమాచాం అందుకున్న హైడ్రా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది బండను ముక్కలుగా చేసి తొలగించారు.
