న్యూఢిల్లీ: ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏండ్ల యువకుడిపై ఓ వ్యక్తి పదునైన కత్తితో దాడి చేశాడు. గాయపడిన యువకుడిని సుందర్ నగరికి చెందిన ఖాసీమ్(20)గా పోలీసులు గుర్తించారు.
అతడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని శుక్రవారం వెల్లడించారు. ఖాసీమ్ పై కత్తితో దాడిచేసిన వ్యక్తిని సోహైబ్(22)గా ఐడెంటిఫై చేశామన్నారు. సోహైబ్, ఖాసీమ్ల మధ్య గతంలో గొడవలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఢిల్లీలో యువకుడిపై కత్తితో దాడి