థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌‌‌తో రాచరికం

థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌‌‌తో రాచరికం

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాచరికం’.  సురేష్ లంకలపల్లి దర్శకుడు. చిల్ బ్రోస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఈశ్వర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన అప్సరా రాణి పస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. డిఫరెంట్ కంటెంట్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్,  విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  అతి త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.