
- ఏపీ సహా సౌత్ స్టేట్స్ లో ‘ఎన్440కే’ వేరియంట్ వ్యాప్తి
- సింప్టమ్స్ ఉండట్లే..
- నో డేంజర్: సీసీఎంబీ డైరెక్టర్
సికింద్రాబాద్, వెలుగు: మన స్టేట్ తో పాటు ఏపీ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ బయటపడింది. సౌత్ స్టేట్స్ లో ‘ఎన్440కే’ అనే కొత్త కరోనా స్ట్రెయిన్ బయటపడిందని, దీనిపై రీసెర్చ్ ఇంకా కొనసాగుతోందని గురువారం హైదరాబాద్ లోని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. అయితే ఇప్పటికే వ్యాపించిన కరోనాతో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల సింప్టమ్స్ చాలా తక్కువగా కన్పిస్తున్నాయని ఆయన తెలిపారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అక్కడక్కడా కొన్ని ‘ఎన్440కే’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే దీని వ్యాప్తి పెద్దగా పెరిగిన దాఖలాలు లేవన్నారు. దీని వల్ల సింప్టమ్స్ కూడా సీరియస్గా లేవని, అంత డేంజరేమీ కాదని రాకేశ్ మిశ్రా తెలిపారు. దీని జీనోమ్కు సంబంధించిన పూర్తి డేటా ఇంకా సిద్ధం కాలేదని, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియను స్పీడప్ చేశామన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇది వ్యాపించిందా? లేదా? అనేందుకు తగిన ఎవిడెన్స్ లేదన్నారు