తెల్లవారుజామున మహిళపై దాడి.. 3 తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిండు

తెల్లవారుజామున మహిళపై దాడి.. 3 తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిండు

మహిళపై దాడి చేసి ఓ దుండగుడు గోల్డ్​ చైన్​ లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్​లో పిల్లి శ్రీలత తన కుటుంబంతో నివసిస్తున్నారు. 

ఆగస్టు 13 తెల్లవారు జామున ఆమె కుక్కను కట్టేయడానికి ఇంటి మెయిన్​డోర్​తెరిచి బయటకు వచ్చింది. అదే సమయంలో  ముఖం కప్పుకొని ఉన్న ఓ దుండగుడు మరో వైపు ఉన్న డోర్​పక్కన నక్కాడు. మహిళ అనుమానం వచ్చి చూడగా.. అకస్మాత్తుగా అతను శ్రీలతపై రాడ్డుతో విరుచుకుపడ్డాడు. 

వనిత ధైర్యంగా ప్రతిఘటించి రాడ్డును లాక్కున్నారు. కానీ మెడలోని 3 తులాల బంగారు చైన్​ని దుండగుడు లాక్కుని పారిపోయాడు.

ఈ ఘటనపై పోలీసులు నమోదు చేయగా రాడ్డు దర్యాప్తులో కీలకంగా మారనుంది. ఘటన సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి.