
హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ మృతిపై ఆమె తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురు స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. పూర్ణచందర్ వేధింపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు. నా కూతురుని పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి పూర్ణచందర్ వెంటపడ్డాడు. కానీ నా కూతురు పెళ్లికి అంగీకరించాక ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు పూర్ణచందర్తో ఉండనని తేల్చి చెప్పింది.
2025, జూన్ 26 ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. ఆరోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను. పూర్ణచందర్తో సంబంధం కొనసాగించలేనని కరాకండిగా చెప్పింది. పూర్ణ చందర్ కూడా ఉండలేనని చెప్పాడని అని తెలిపారు. పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైంది.. ఆ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
►ALSO READ | రైల్వే ట్రాక్పై కారు నడిపి హల్చల్.. కట్ చేస్తే మెంటల్ హాస్పిటల్కు.. అసలేం జరిగిందంటే..?
కాగా, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జవహర్ నగర్లోని తన నివాసంలో శుక్రవారం (జూన్ 27) రాత్రి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గాంధీ ఆసుపత్రిలో స్వేచ్ఛ మృతిదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. స్వేచ్ఛ కళ్లను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి దానం చేశారు. శనివారం (జూన్ 28) సాయంత్రం పార్శిగుట్టలో స్వేచ్ఛ అంత్యక్రియలు జరగనున్నాయి. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, కవులు, మేధావులు సంతాపం వ్యక్తం చేశారు.