మూడో అంతస్తు నుంచి..సెంట్రింగ్ డబ్బా..మీద పడి ఒకరి మృతి

మూడో అంతస్తు నుంచి..సెంట్రింగ్ డబ్బా..మీద పడి ఒకరి మృతి

మెహిదీపట్నం, వెలుగు : నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై మూడో అంతస్తు నుంచి సెంట్రింగ్ డబ్బా పడటంతో అతడు చనిపోయిన ఘటన గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్వాన్​లోని శంకర్​నగర్ ప్రాంతానికి చెందిన రాజు(56) శుక్రవారం మధ్యాహ్నం కార్వాన్ నుంచి లంగర్​హౌస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

వింటేజ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి రాగానే.. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి సెంట్రింగ్ డబ్బా రాజుపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఉస్మానియాకు తీసుకెళ్లారు. అప్పటికే రాజు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాజు కుటుంబసభ్యులు ఇచ్చిన కంప్లయింట్ మేరకు బిల్డింగ్ ఓనర్​పై కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.