కరోనాకు మందు కనిపెట్టా.. పట్టించుకోవడం లేదంటూ డాక్టర్ నిరసన

కరోనాకు మందు కనిపెట్టా..  పట్టించుకోవడం లేదంటూ డాక్టర్ నిరసన

సుల్తాన్ బజార్ యూపీహెచ్సీలో ఓ డాక్టర్ హంగామా సృష్టించాడు. పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని డాక్టర్ వసంత్ కుమార్ నిరసనకు దిగాడు. తాను కరోనాకు మందు కనిపెట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం రూ.45లకే ఐదు రోజుల్లో కోవిడ్ పూర్తిగా నయం చేస్తానని చెబుతున్నాడు. తాను చెప్పే మాటలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రాత్రి రూమ్‭లోకి వెళ్లి తాళం వేసుకుని.. పెట్రోల్ డబ్బాతో నిరసన తెలుపుతున్నాడు. గాంధీ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‭గా పనిచేసి.. సుల్తాన్ బజార్‭లోని యూపీహెచ్సీకి వచ్చాడు. 

సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాని వసంత్ కుమార్ మాత్రం బయటికి రాలేదు. తాను చెప్పేది ఎవరూ నమ్మడం లేదని చెబుతున్నాడు. అధికారులు స్పందించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వసంత్ కుమార్ నిరసన వ్యక్తం చేస్తున్నాడు.