![ఒక రోజు ఏడు ర్యాకుల బొగ్గు రవాణాతో రికార్డు](https://static.v6velugu.com/uploads/2024/04/a-record-with-transportation-of-seven-racks-of-coal-in-one-day_2BC5je6nzD.jpg)
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్పీ(కోల్ హ్యాండ్లింగ్ప్లాంట్) ఒక రోజు అత్యధికంగా ఏడు ర్యాకుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. శనివారం ఏడు రేకుల (1 రేకు అంటే 4 వేల టన్నుల బొగ్గు లోడు కలిగిన గూడ్స్ రైలు) ద్వారా 28వేల టన్నుల బొగ్గు రవాణా చేసి 47ఏండ్ల సీహెచ్పీ చరిత్రలో అత్యధిక రవాణాగా రికార్డు సాధించింది.
మరోవైపు 2023-–24 ఆర్థిక సంవత్సరం సీహెచ్పీకి నిర్దేశిత బొగ్గు రవాణా టార్గెట్22 లక్షల టన్నులకు గానూ.. ఏకంగా 31 లక్షల టన్నుల రవాణా చేసింది. అత్యధిక బొగ్గు రవాణా చేయడానికి కృషి చేసిన సీహెచ్పీ ఇన్చార్జి బాలాజీ భగవతి ఝూ, ఇంజనీర్లు చంద్రమౌళి, అశోక్రెడ్డి, సంతోశ్, ఉద్యోగులు, కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్, ఏరియా ఇంజనీర్ నాగరాజ్ఆదివారం అభినందించారు.