హైదరాబాద్: ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఈ నెల చివరి వారంలో చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, హరిత హారం, ఉపాధి హామీ తదితర పనుల అమలు గురించి సీఎం అధికారులతో చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మేయర్లు, కమిషనర్లు తదితరులు పాల్గొననున్నారు.
మరిన్ని వార్తల కోసం...