హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం..యువతి ప్రాణం తీసిన అతివేగం

హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం..యువతి ప్రాణం తీసిన అతివేగం

హైదరాబాద్ : మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కిందపడి ఓ యువతి మృతిచెందింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

కోల్కతాకు చెందిన స్విటి పాండే (22) అనే యువతి తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి బైక్ పై.. జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు బయలుదేరారు. రాయన్ ల్యుకే చాలా స్పీడ్ గా బైక్ ను నడపడం వల్ల హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్ వెనకాల కూర్చున్న స్విటి పాండే ఎగిరి ఫ్లైఓవర్ పై నుంచి కింది పడింది.ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు రాయన్ ల్యుకే ఫ్లైఓవర్ గోడను ఢీకొని గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్విటి పాండే మృతి చెందింది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.