- 13 మంది నుంచి రూ.6.12 కోట్లు వసూలు
- సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ ఓ సాఫ్ట్వేర్ఉద్యోగి 13 మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10లక్షలు కట్టించుకుని పరారయ్యాడు. సైబరాబాద్ ఎకనామిక్అఫెన్స్వింగ్ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్(40) మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొండాపూర్మజీద్బండలో ఉంటున్నాడు. తోటి ఉద్యోగులతోపాటు బంధువులకు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు.
అలా 13 మంది శ్రీధర్కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున చెల్లించారు. డబ్బు కట్టించుకున్నాక గోల్డ్ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న శ్రీధర్పై ఓ బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో శ్రీధర్ 13 మంది చీట్చేసి రూ.6.12 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్ట్చేశారు.