కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
  • కోయపోషగూడెంలో ఉద్రిక్తత కంటిన్యూ
  • అటవీ శాఖ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం

మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు, గిరిజన మహిళల మధ్య తోపులాట జరిగింది. సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు. ఆ గుడిసెలను తొలగించేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు గిరిజన మహిళలు. పలువురు గిరిజన మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గిరిజన మహిళలను ఈడ్చుకెళ్లారు ఫారెస్ట్ మహిళా సిబ్బంది. మూడు వందల మంది ఫారెస్ట్ అధికారులు, పోలీసులు మోహరించి.. కోయపోషగూడెం గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.