- స్వీపర్ అరెస్ట్
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ట్రెయినీ ఎయిర్హోస్టెస్ హత్యకు గురైంది. తన ఫ్లాట్లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మృతురాలిని చత్తీస్గఢ్కు చెందిన రూపాల్ ఓగ్రే(24)గా గుర్తించారు.
ఆమె ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్లో ముంబైకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆ బిల్డింగ్లో హౌస్ కీపింగ్లో స్వీపర్గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, రూపాల్పై విక్రమ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.