ఎయిర్​హోస్టెస్ హత్య ముంబైలో దారుణం..​

ఎయిర్​హోస్టెస్ హత్య ముంబైలో దారుణం..​
  • స్వీపర్​​ అరెస్ట్

ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ట్రెయినీ ఎయిర్​హోస్టెస్ హత్యకు గురైంది. తన ఫ్లాట్​లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మృతురాలిని చత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే(24)గా గుర్తించారు. 

ఆమె ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆ బిల్డింగ్​లో హౌస్ కీపింగ్​లో స్వీపర్​గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే, రూపాల్​పై విక్రమ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.