కునో నేషనల్ పార్క్ లో మరో చీతా కూన మృతి

కునో నేషనల్ పార్క్ లో మరో చీతా కూన మృతి

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఉన్న  కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న చీతా కూన (ఆడ చిరుత పిల్ల) మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల అనే ఆడ చీతా (జ్వాల)కు ఈ ఏడాది మార్చ్ నెలలో నాలుగు కూనలు పుట్టాయి. అయితే వీటిలో ఒకటి మంగళవారం (మే 23న) మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

చీతా కూన మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. ఇప్పటికే ఈ నేషనల్ పార్క్ లో మూడు చీతాల మరణంతో తలలు పట్టుకుంటున్న అటవీశాఖ అధికారులకు ఈ పిల్ల చీతా మృతి మరో సమస్య తెచ్చిపెట్టింది.

తాజాగా మరో పులి పిల్ల చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతుండగా అటవీశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరుపైనా, సమర్థత పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు ఉండవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మూడు నెలల కాలంలో ఇప్పటికే సాషా, ఉదయ్, దక్ష అనే చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో దక్ష తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. ప్రస్తుతం ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 17 చీతాలు, మూడు కూనలు ఉన్నాయంటున్నారు.

సుమారు 75 సంవత్సరాల ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చారు.