లిక్కర్ లోడ్ బోల్తా బీర్ల కోసం ఎగబడ్డ జనం

లిక్కర్ లోడ్ బోల్తా  బీర్ల కోసం ఎగబడ్డ జనం

జగిత్యాల జిల్లాలో మద్యం లోడ్ తో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడింది. కరీంనగర్ నుంచి కోరుట్లకు మద్యం నిల్వలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో మల్యాల మండలం వీఆర్ కే ఇంజనీరింగ్ కళాశాల దగ్గర  డీసీఎం వ్యాన్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 30 లక్షల విలువైన లిక్కర్ నేలపాలైంది. స్థానికులు మద్యం బాటిళ్ల కోసం చుట్టూ గుమిగూడారు. అందినకాడికి వారి కళ్లు కప్పి తీసుకెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నారు.