బీజేపీ రెండో జాబితా రిలీజైంది. 72 మందితో కూడిన సెకండ్ లిస్టును ప్రకటించగా తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు లభించింది. మెదక్ నుంచి రఘనందన్ రావు, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, మహబూబాబాద్ సీతారం నాయక్, మహబూబ్ నగర్ నుంచి డీకే ఆరుణ పేర్లను బీజేపీ ప్రకటించింది.
ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజా జాబితాతో తెలంగాణలో మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు ఖరారు అయినప్పటికీ చివరి నిమిషంలో ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మహబూబ్ నగర్ సీటు ఆశించిన జితేందర్ రెడ్డిలకు బిగ్ షాకిచ్చింది అధిష్టానం.
మొత్తం 10 రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలికి సంబంధించిన అభ్యర్థులనూ బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ(2), గుజరాత్(7), హరియాణా(6), హిమాచల్ ప్రదేశ్(2), కర్ణాటక(20), మధ్యప్రదేశ్(5), మహారాష్ట్ర(20), త్రిపుర(1), ఉత్తరాఖండ్(2), దాద్రా నగర్ హవేలి(1) స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.