ఐపీఎల్ లో భాగంగా ఏప్రిల్ 18న మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రోహిత్ సేన జట్టు ఇవాళ (సోమవారం) హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. మేము వచ్చేశాము..MI ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కి అని పిలుపునిచ్చాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ రో హైదరాబాద్ వచ్చేసాడు అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
రోహిత్ తెలుగులో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కు వెల్ కమ్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ కోసం ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుతున్నారు. రోహిత్ శర్మ కొట్టే కొట్టుడుకు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లాలని కామెంట్ చేస్తున్నారు.
ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ముంబై తర్వాతి రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదుంది. సన్ రైజర్స్ కూడా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లు గెలిచింది.