పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్​ఏ నిరసన

పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్​ఏ నిరసన

పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్​ఏ నిరసన

నర్సింహులపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 23వేల మందికి వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ఏపీలోని తిరుమల కొండపై ఓ వీఆర్​ఏ ప్లకార్డుతో నిరసన తెలిపాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ శేఖర్, తిరుమలలో నిరసన వ్యక్తం చేశాడు.

మునుగోడు బై ఎలక్షన్​ టైంలో కల్లబొల్లి మాటలు చెప్పి తమ దీక్షలు విరమింపజేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ప్లకార్డు పట్టుకుని కొండ పైకి చేరుకున్నాడు. వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మనసు కరిగేలా చేయాలని మొక్కులు చెల్లించుకున్నాడు.