నాటు బాంబు పేలి...తీవ్రంగా గాయపడ్డ మహిళ

నాటు బాంబు పేలి...తీవ్రంగా గాయపడ్డ మహిళ

కామారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. ఇంట్లో దాచిన నాటు బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రవీందర్ ఇంట్లో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఇంట్లో దాచిన నాటుబాంబులు ఒక్కసారిగా పేలి భారీ మంటలు ఎగిసిపడ్డాయి. బాంబులు పేలినప్పుడు రవీందర్ భార్య శిరీష ఇంట్లోనే ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది.

 స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిరీషను ఇంట్లో నుంచి రెస్య్కూ చేసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బంధువులు శిరీషను హైదరాబాద్ కు తరలించారు. శిరీష భర్త రవీందర్ అటవీ జంతువుల వేట కోసం నాటు బాంబులను ఇంట్లో దాచి ఉంచినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రామారెడ్డి పోలీసులు తెలిపారు.