రోడ్డుపై ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

రోడ్డుపై ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

మేడ్చల్, వెలుగు: ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో రోడ్డుపైనే మగశిశువుకు జన్మనిచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన చిత్తారి సతీమణి కవిత 9 నెలల గర్భవతి. ఆమె బుధవారం డబీల్​పూర్​బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్లింది. బ్యాంకు నుంచి బయటికి వచ్చిన కవితకు పురిటినొప్పులు వచ్చాయి. విషయం గమనించిన స్థానికులు రోడ్డు పక్కకు తీసుకెళ్లి పురుడుపోశారు. కవిత మగబిడ్డను జన్మనిచ్చింది. అప్పటికే స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేతుకున్న 108 సిబ్బంది తల్లి, బిడ్డను శ్రీరంగవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు