పెండ్లి కావట్లేదని యువకుడు సూసైడ్

పెండ్లి కావట్లేదని యువకుడు సూసైడ్

జీడిమెట్ల, వెలుగు : పెండ్లి కావడం లేదని బాధతో ఓ యువకుడు సూసైడ్​చేసుకున్నాడు. పేట్ బషీరాబాద్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. మెదక్​జిల్లాకు చెందిన ఎ.విష్ణుప్రసాద్(35) సిటీకి వచ్చి కొంపల్లి పరిధి గాంధీనగర్​లో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పెండ్లి కావట్లేదని బాధపడుతున్నాడు. బుధవారం తల్లి పనికి వెళ్లగా, విష్ణుప్రసాద్ ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.