- మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏ4 గా రవి
- అప్పట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటన
- ఇప్పుడు ప్లీనరీలో లీడర్లు, పోలీసులతో కలిసి హడావుడి
హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీనివాస్గౌడ్హత్యకు కుట్ర కేసులో కీలక నిందితుడు, ఏ4గా ఉన్న మున్నూరు రవి బుధవారం హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న పేట్బషీరాబాద్సీఐ రమేశ్తో మున్నూరు రవి సెల్ఫీ దిగడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిని చంపాలనుకున్న వ్యక్తిని ఆ పార్టీ ప్లీనరీకి ఆహ్వానించడం ఆశ్చర్యపరుస్తున్నది. మంత్రి హత్యకు కుట్ర కేసులో మార్చి 2న ప్రధాన నిందితుడు చలువగాలి రాఘవేందర్ రాజు సహా మొత్తం8 మందిని పేట్ బషీర్బాద్ పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో మున్నూరు రవి ఒకరు. గతంలో శ్రీనివాస్గౌడ్ అనుచరుడైన రవిని.. హత్య కుట్ర కేసు బయటకు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ ప్రకటించారు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ ప్లీనరీకి రావడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న సీఐతో సెల్ఫీలు తీసుకుంటూ హల్చల్చేయడం హాట్టాపిక్గా మారింది.
ఇప్పటికీ టీఆర్ఎస్తో సంబంధాలున్నాయా?
మంత్రి హత్యకు కుట్ర కేసులో మహబూబ్నగర్కు చెందిన మున్నూరు రవిని మార్చి 2న ఢిల్లీలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి రోజే ఆయనతో పాటు మరో ఏడుగురు మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పారు. అనంతరం విచారణ చేసి, వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. 31 రోజుల తర్వాత నిందితులంతా ఇటీవల బెయిల్పై విడుదలై వచ్చారు. కాగా, ‘మంత్రి హత్యకు కుట్ర’ చేశారనే వార్తలు రావడంతో మార్చి 4న మున్నూరు రవితో పాటు మరో ముగ్గురి సభ్యత్వాలను రద్దు చేసి, టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. నాడు సస్పెండ్అయిన మున్నూరు రవి బుధవారం జరిగిన ప్లీనరీకి రావడానికి ఐడెంటిటీ కార్డు ఎలా వచ్చిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఆనాటి సస్పెన్షన్ అంతా ఉత్తిదేనా? గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవి ఇప్పటికీ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు మెయింటెన్ చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలో పట్టుకున్నామంటూ..
మార్చి 2న నిందితుల అరెస్ట్ అనంతరం సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘తన బార్, రియల్ఎస్టేట్వ్యాపారానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, గులాంహైదర్ అడ్డుగా ఉన్నారని చలువగాలి రాఘవేందర్ రాజు భావించాడు. వీరిద్దరిని చంపేందుకు రూ.15 కోట్ల సుపారీ ఆఫర్ ఇచ్చి నాగరాజు, మధుసూదన్ రాజు,అమరేందర్ రాజు, మున్నూరు రవి, దండేకర్ విశ్వనాథరావు, వరద యాదయ్యలతో కలిసి కుట్ర చేశాడు. ఈ క్రమంలోనే సుచిత్ర దగ్గర హైదర్ను చంపే ప్రయత్నంవిఫలం కావడంతో గన్స్ ను బౌరంపేట్ ఫారెస్ట్ లోని చెట్ల పొదల్లో దాచిపెట్టి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి సౌత్ అవెన్యూ సర్వెంట్ క్వార్టర్స్లోని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కారు డ్రైవర్ తిలక్ థాప రూమ్లో షెల్టర్ తీసుకున్నారు” అని పేర్కొన్నారు. జితేందర్రెడ్డి క్వార్టర్లో నిందితులు షెల్టర్ తీసుకున్నారని సీపీ చెప్పడం ద్వారా బీజేపీ నేతలకు మంత్రి హత్యకు కుట్ర కేసుతో సంబంధం ఉందన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా నిందితుడే ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.