‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ (OTT) విడుదలపై స్పందించిన ఆదాశర్మ..

‘ది కేరళ స్టోరీ’  ఓటీటీ (OTT) విడుదలపై స్పందించిన ఆదాశర్మ..

సుదీప్తో సేన్‌(Sudipto Sen) డైరెక్ట్ చేసిన  ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) బాక్సాపీస్ వద్ద విజయం సాధించింది. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి  50 రోజులు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటి వరకు ఓటీటీ (OTT) విడుదల ఆలస్యమవుతున్న సందర్బంగా నెటిజన్స్ చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్‌ పెడుతున్నారు.

తాజాగా ఈ ట్వీట్స్ కు అదాశర్మ(Adah Sharma) స్పందిస్తూ ' ఒక మంచి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50రోజులు పూర్తి చేసుకుంది. ఇది చిత్ర బృందానికే కాకుండా మొత్తం సినిమా పరిశ్రమకూ భారీ వేడుకతో సమానం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన తర్వాతనే ఓటీటీలో ప్రసారం చేస్తారు. ఏ ఓటీటీ సంస్థకు ఇవ్వాలా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే దీని ఓటీటీ (OTT) విడుదల ఆలస్యమవుతోంది’’ అని స్పందించింది. 

Rukooo !!! Panic mat karo !!
Abhi tak theatres mein chal Rahi hai #TheKeralaStory ... Now thode din aur let it be in theatres ? And then very soon apke nazdeeki cinema Ghar se aapke cell phone Tak aa jaegi. See you soon in your homes...don’t worry (unless cupboard saaf nahi hai… pic.twitter.com/iPZ1TlamON

— Adah Sharma (@adah_sharma) June 27, 2023

 

డైరక్టర్ లవ్ జిహాద్ అంశంపై ఈ మూవీని తెరకెక్కించారు. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్లను దేశాల్ని దాటించి, వారితో భిన్నమైన రీతిలో బిజినెస్ కార్యకలాపాలు చేపిస్తారనే  అంశంపై కేరళ స్టోరీ రూపొందించబడింది. ఈ మూవీ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో నడుస్తున్న సంగతి తెలిసేందే. ఇక OTT విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.