
ఆది సాయికుమార్ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు ఎంట ర్టైన్మెంట్ కూడా ఉన్న సినిమా. హీరో క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటుంది. అందుకే ఈ టైటిల్. ఇతరులు చెప్పేది పూర్తిగా వినకుండానే నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల ఎలాంటి సమస్యలొచ్చాయనేది కాన్సెప్ట్. ఈ కథని మొదట రామ్కి చెప్పాను. నచ్చింది కానీ అప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ హిట్ రావడంతో ఆ టైమ్కి ఇది కరెక్ట్ కాదన్నారు.
తర్వాత ఆది ఓకే చెప్పారు. స్టోరీ సీరియస్గా ఉంటుంది కానీ హీరో క్యారెక్టర్ మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్స్. ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఉంది. హీరో ఎవర్ని పెళ్లి చేసుకుంటాడనేది సస్పెన్స్. అనీష్ కురువిల్లా, వినోదినీ వైద్యనాథన్, సప్తగిరి, నర్రా శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సాయికుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. పాత్రలన్నీ కొత్తగా ఉంటాయి’ అని చెప్పాడు.