బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో నియంత పాలన అంతమై ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం శుభపరిణామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. లిబర్టీలోని ఆప్ రాష్ట్ర ఆఫీసులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకార ధోరణి, నియంత పాలన కారణంగానే బీఆర్ఎస్ ప్రజాగ్రహానికి గురై చిత్తుగా ఓడిందన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఫూర్తి మెజార్టీ సాధించిన సందర్భంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిని అంతం చేసి, 6 గ్యారెంటీలను, వివిధ హామీలను సక్రమంగా అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని విజ్ఞప్తి చేశారు . సమావేశంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బుర్ర రాము గౌడ్, డా. పాండురంగరావు, రాష్ట్ర నేతలు వినయ్ రెడ్డి, జిల్లోజు హేమ తదితరులు పాల్గొన్నారు.