గుజరాత్‭లో కాంగ్రెస్ మెజారిటీకి గండి కొట్టిన ఆప్

గుజరాత్‭లో కాంగ్రెస్ మెజారిటీకి గండి కొట్టిన ఆప్

గుజరాత్‭లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గండి కొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయింది. గతం కంటే దాదాపు 50 సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 20 లోపు సీట్లలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక 5 నుంచి 10 సీట్లలో ఆప్ మెజార్టీలో ఉంది. 1985లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 149 సీట్లు  గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు 150కి పైగా సీట్లలో కమలం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

గుజరాత్ లో వరుసగా ఆరు ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల స్థాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైనా.. గౌరవ ప్రధమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కాని ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంతో పరిస్థితి తారుమారైంది.