కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సోమ్ నాథ్ భారతీ అన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దోమలగూడలోని ఆప్ కార్యాలయంలో మహా పాదయాత్ర పోస్టర్ ను ఆయన రిలీజ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సోమ్ నాథ్ భారతీ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ఆప్ ను ఆదరించాలని కోరారు. ఆప్ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ... ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో మహా పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని కోరారు. 


మరిన్ని వార్తల కోసం..

14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

షాంఘైలో ఆకలి కేకలు!