- సోనియాగాంధీ పేరుతో అభయహస్తం అప్లికేషన్
- కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి , ఉత్తమ్, పొన్నం
- కూతురిగా కొండా సురేఖ
- అల్లుడిగా శ్రీధర్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల ప్రజాపాలన అభయహస్తం పథకానికి గుర్తు తెలియని వ్యక్తులు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పేరుతో అప్లికేషన్ పెట్టారు. ఈ ఫాంలో కొడుకులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను పేర్కొన్నారు. కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసారు.
ప్రస్తుతం ఈ అప్లికేషన్కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సోనియా పేరుతో ఏ జిల్లాలో దరఖాస్తు చేశారో వివరాలు తెలియలేదు. గత డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రొగ్రాం జనవరి 6న ముగిసింది. ఇప్పటివరకు కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.