అదానీ గ్రూప్​లో ఐహెచ్​సీ భారీ పెట్టుబడి

అదానీ గ్రూప్​లో ఐహెచ్​సీ భారీ పెట్టుబడి
  • అదానీ గ్రీన్​ ఎనర్జీలో రూ. 3,850 కోట్లు..
  • అదానీ ట్రాన్స్​మిషన్​లో రూ. 3,850 కోట్లు 
  • అదానీ ఎంటర్​ప్రైజస్​లో రూ.7,700 కోట్లు

న్యూఢిల్లీ: అబుదాబి గ్రూప్..​ ఇంటర్నేషనల్​ హోల్డింగ్​ కంపెనీ (ఐహెచ్​సీ) అదానీ గ్రూప్​లో రూ. 14,400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తమ గ్రూప్​లోని మూడు కంపెనీలలో ఐహెచ్​సీ ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు   గౌతమ్​ అదానీ వెల్లడించారు. మూడు కంపెనీలలోనూ ప్రిఫరెన్షియల్​ ఇష్యూ కింద ఈక్విటీ షేర్లను ఐహెచ్​సీ తీసుకోనుంది. అయితే ఎంత ఈక్విటీ వాటా తీసుకోనుందనే వివరాలను మాత్రం గౌతమ్​ అదానీ చెప్పలేదు. ఈ పెట్టుబడి ప్రపోజల్​కు సెబీ, షేర్​హోల్డర్లతోపాటు ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్​ రావాల్సి ఉంటుంది. ఇండియాలోనూ, మిడిల్​ ఈస్ట్​, ఆఫ్రికాలలోనూ ఉన్న ఆపర్చునిటీస్​ను బిజినెస్​గా మలుచుకోవడానికి అదానీ గ్రూప్​, ఐహెచ్​సీలు కలిసి పనిచేయనున్నాయి. సస్టెయినబుల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, గ్రీన్​ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్​మిషన్​ వంటి రంగాలలో రెండు గ్రూప్​లకు ఒకే విజన్​ ఉందని అదానీ గ్రీన్​ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సాగర్​ అదానీ చెప్పారు. రెండు గ్రూప్​ల మధ్య బంధం మరింత బలపడటానికి ఈ ట్రాన్సాక్షన్​ దారి తీస్తుందని, యూఏఈ నుంచి మరిన్ని పెట్టుబడులు దేశంలోకి రావడానికీ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.