
ఓయూ, వెలుగు : టీఎస్సెట్– 2024 ఎగ్జామ్ఫీజును తగ్గించాలని, ఇంగ్లీష్ తోపాటు తెలుగులో ఎగ్జామ్నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం టీఎస్ సెట్ కన్వీనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. టీఎస్ సెట్ ఎగ్జామ్ఫీజు నేషనల్లెవల్లో నిర్వహించే యూజీసీ
నెట్ ఫీజుల కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరారు. స్థానిక భాషల్లో ఎగ్జామ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఫోక్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరారు.