పీయూలో కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం

పీయూలో కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం

మహబూబ్​నగర్ రూరల్/వనపర్తి టౌన్/ గద్వాల: సీఎం పదవికి​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం పీయూ మెయిన్ గేట్  ముందు ఏబీవీపీ నాయకులు కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెండోసారి గ్రూప్  వన్  పరీక్ష రద్దయినా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. పరీక్షల రద్దు వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

విజయ్, శీను, గోపాల్, అర్జున్ రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. ఏబీవీపీ నగర కార్యదర్శి బాలకృష్ణ,  కేదార్​నాథ్, పరుశురాములు, కార్తీక్, వెంకటేశ్, నితిన్  పాల్గొన్నారు. గద్వాల వైఎస్సార్  చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు నరేశ్, అశోక్, వెంకటేశ్, తేజ, మురళి, అనిల్, పవన్  పాల్గొన్నారు.