- ఏసీబీకి పట్టుబడ్డ లాలాగూడ విద్యుత్ శాఖ లైన్ ఇన్ స్పెక్టర్
సికింద్రాబాద్, వెలుగు : కరెంట్ మీటర్ కనెక్షన్ను మార్పు చేసేందుకు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. లాలాగూడలోని టీఎస్ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసు పరిధిలో జి. వెంకటేశ్వర్లు లైన్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఉండే మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటి విద్యుత్ మీటర్ను కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ గా మార్చాలని విద్యుత్ శాఖకు దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తును కొంతకాలంగా లైన్ ఇన్స్పెక్టర్ పెండింగ్లో పెట్టాడు.
షాహిద్ పలుమార్లు వెళ్లి అడగగా వెంకటేశ్వర్లు రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం షాహిద్ లాలాగూడలో వెంకటేశ్వర్లుకు డబ్బు అందిస్తుండగా ఏసీబీ అధికారులు వెళ్లి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఏసీబీ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరు పరిచి, చర్లపల్లి జైలుకు తరలించారు.