హైదరాబాద్ చైతన్య పురి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. చైతన్య పురి పీఎస్ కు చెందిన కానిస్టేబుల్ నరేందర్ , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు , కానిస్టేబుల్ మల్లేశంలు కోర్టు వారెంట్ రీకాల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ముగ్గురు గత కొంత కాలంగా కోర్టు వారెంట్లను అడ్డంగా పెట్టుకుని పలు కేసులలో వారెంట్లు జారీ అయిన నిందితులను బెదిరిస్తు, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.
తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు నూజివీడుకు చెందిన వెంకటరమణ. ఇప్పటి వరకు 3 లక్షలు ఇచ్చిన..పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమను ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఈ క్రమంలో చైతన్య పురి పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించగా ఆధారాలు దొరకడంతో ముగ్గురు పోలీస్ కానిస్టుబుళ్లు..వారికి సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు.