
జీడిమెట్ల, రామచంద్రాపురం, వెలుగు: లంచం తీసుకుంటూ ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్తు డీఈ, వీఆర్వో ఏసీబీకి చిక్కారు. మేడ్చల్జిల్లా కొంపల్లి పరిధిలో కొత్త వెంచర్లో ట్రాన్స్ఫార్మర్, అండర్ గ్రౌండ్ఏర్పాటుకు సంబంధించిన పనులను బాలనర్సింహ అనే కాంట్రాక్టరు మరొకరి నుంచి సబ్కాంట్రాక్ట్తీసుకున్నాడు. ఈ పని కోసం ఏఈ, ఏడీఈలు ఎస్టిమేషన్ వేసి డీఈకి పంపించారు. ఈ ఎస్టిమేషన్ను ఎస్ఈకి పంపించకుండా మేడ్చల్డీఈ కె.ప్రసాదరావు తన వద్ద పెండిగ్పెట్టుకున్నాడు. ఎస్ఈకి పంపడానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ బేరమాడితే రూ.30 వేలకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.25 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.5 వేల కోసం ఇబ్బంది పెట్టడంతో కాంట్రాక్టర్ బాలనర్సింహ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జీడిమెట్ల వెన్నలగడ్డలోని డీఈ కార్యాలయంలో గురువారం రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఈ ప్రసాద్ రావును అరెస్టు చేశామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
ఆర్సీపురంలో ఇన్చార్జి వీఆర్వో..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ఆఫీస్పై గురువారం ఏసీబీ అధికారులు రైడ్చేసి వీఆర్వోను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామంలో మహ్మద్ జాకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు కొంత పొలం ఉంది. దానికి సంబంధించిన కాస్రా పహానీ, ఆర్ఓఆర్ల్యాండ్ రికార్డులు కావాలంటూ గత నెల 30న జాకీర్ హుస్సేన్ తహసీల్దార్ఆఫీసులో డీటీ గంగాధర్ను కలిశాడు. డీటీ ల్యాండ్ పేపర్లు పరిశీలించి రికార్డ్ అసిస్టెంట్గా ఉన్న వీఆర్వో వెంకటయ్య వద్దకు పంపాడు. జాకీర్హుస్సేన్ అడిగిన రికార్డులు ఇచ్చేందుకు వీఆర్వో రూ. 6 వేలు లంచం అడిగాడు. ఆ రోజే రూ. 2వేలు ఇచ్చిన హుస్సేన్ను మిగతా డబ్బుల కోసం వీఆర్వో తరచూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద అంత డబ్బు లేదని రైతు చెప్పడంతో రూ. 2 వేలు తగ్గించి మిగతా డబ్బులు ఇవ్వాలని అన్నాడు. ఈ నెల 5న జాకీర్ హుస్సేన్ సంగారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వెంకటయ్యకు రూ. 2 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో వెంకటయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెంకటయ్య జహీరాబాద్ వీఆర్వోగా కాగా ఆర్సీపురంలో డిప్యుటేషన్పై ఉన్నాడు.