
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివ బాలకృష్ణను ఏసీబి అధికారులు మరికాసేపట్లో కస్టడీకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను 8 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఇవాళ శివ బాల కృష్ణకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు తెరవనున్నారు. బినామీ ఆస్తులు, పుప్పాల గూడలో వేయి కోట్లు ప్రాజెక్ట్ అవకతవకలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేసింది. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.