
బూర్గంపహాడ్, వెలుగు: బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో గురువారం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో అవినీతి జరుగుతోందని గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫోన్ పేద్వారా నగదు బదిలీ జరిగినట్లు, కార్యాలయంలో ప్రైవేట్వ్యక్తుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. పూర్తి వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.