- టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఫైల్స్ తనిఖీ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. థర్డ్ ఫ్లోర్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ సిబ్బంది డోర్లు క్లోజ్ చేసి తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగించారు.
టౌన్ ప్లానింగ్లో పని చేస్తున్న ఇద్దరు ఏసీపీలు, ఒక టీపీవో, 2 టీపీఎస్లు, ఐదుగురు టీపీబీవోలు, చైన్మెన్, కంప్యూటర్, సెక్షన్ అసిస్టెంట్తో పాటు అటెండర్ను కూడా పలు అంశాలపై ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ సెక్షన్, అకౌంట్స్, రెవెన్యూ, ఆడిట్ విభాగం స్టాఫ్ రెగ్యులర్ టైంకంటే ముందే ఇండ్లకు వెళ్లిపోయారు. సోదాలు సాఫీగా కొనసాగించడానికి లోకల్ పోలీస్లతో బందోబస్తు ఏర్పాటు చేయించారు.
