ఆసియా క‌ప్ అండ‌ర్ 19 జట్టు ప్రకటన.. డిసెంబర్ 10న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

ఆసియా క‌ప్ అండ‌ర్ 19 జట్టు ప్రకటన.. డిసెంబర్ 10న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

డిసెంబర్ 8 నుంచి దుబాయ్ వేదికగా ఆసియన్ దేశాల మధ్య అండ‌ర్ -19  సమరం షురూ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం బీసీసీఐ శ‌నివారం 15 మందితో కూడిన జట్టును ప్ర‌క‌టించింది. ఉద‌య్ స‌హ‌ర‌న్‌ కెప్టెన్‌గా వ్యహరించనుండగా, సౌమీ కూమార్ పాండే వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యారు.

ఈ టోర్నీలో భారత యువ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌తో తలపడనుండగా, డిసెంబర్ 10న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

భారత అండర్-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా , ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆరధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.

స్టాండ్‌బై ప్లేయర్స్: ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గోసాయి, మహమ్మద్ అమన్.

రిజర్వ్ ప్లేయర్స్: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే. 


ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం జట్లు: 8(భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, జపాన్).