‘భారతీయుడు2 షూటింగ్లో ప్రమాదంముగ్గురు మృతి
భారీ క్రేన్ తెగిపడి ఘోరం కమల్హాసన్ క్షేమం
సినిమా యూనిట్పై కుప్పకూలిన భారీ క్రేన్
డైరెక్టర్ శంకర్కు తీవ్ర గాయాలు మరో 10 మందికి గాయాలు
ఆ టైంలో అక్కడే ఉన్న కమల్
చెన్నై:కమల్హాసన్ హీరోగా ఎన్.శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ కుప్పకూలి మీదపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డైరెక్టర్ శంకర్తో పాటు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శంకర్ కాలు విరిగింది. కొన్నిరోజులుగా చెన్నైలో సమీపంలోని పూనమల్లి దగ్గర ‘భారతీయుడు 2’ షూటింగ్ జరుగుతోంది. బుధవారం రాత్రి షూటింగ్ కొనసాగుతుండగా భారీ క్రేన్ చిత్ర బృందంపై పడింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డైరెక్టర్ శంకర్తో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే సెట్లో హీరో కమల్హాసన్తో పాటు హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు.