ఆర్ ఎల్ నగర్ లో యాక్సిడెంట్.. కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఆర్ ఎల్ నగర్ లో యాక్సిడెంట్.. కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు

మేడ్చల్ జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ ఎల్ నగర్ లో అర్థ రాత్రి అతివేగంతో వచ్చిన ఓ కారు కరెంట్ పోల్ ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకి, 108కి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఇద్దర్ని ఇస్పత్రికి తరలించారు. 

ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ మద్యం మత్తులో జరిగిందా లేదా అతివేగంతో జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.