హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వస్తుండగా రాళ్లగుడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండలానికి చెందిన బాల్రెడ్డి నర్సింహా, శంకర్లుగా గుర్తించారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.