
ఆఫ్రికన్ సాహిత్యం గురించి ప్రస్తావన వస్తే తొలుత చర్చించుకునేది రచయిత గూగీ వా థియోంగో గురించి. ఆఫ్రికన్ అక్షర యోధుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న గూగీ వా థియోంగో (87) దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన రాసిన ‘‘Decolonising the Mind’’ బుక్ చాలా ఫేమస్. ఆయన చనిపోయినట్లు ఆయన కుమార్తె వాంజికు వా గూగీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
అట్లాంటాలో ఆయన చనిపోయారు. ఆయన సంపూర్ణ జీవితం ఆస్వాదించారని, ఒక మంచి పోరాటా యోధుడిగా నిలిచారని ఆమె చెప్పారు. 1995లో థియోంగో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో పాటు ఆయనకు 2019లో ట్రిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. ఆయనకు మొత్తం తొమ్మిది మంది సంతానం. ఇందులో.. నలుగురు రచయితలే కావడం విశేషం.
జీవించడానికి ప్రతి ఘటనను మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదని 2018లో ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. గూగీ వా థియోంగో కుమార్తె కూడా ఒక రచయితనే కావడం గమనార్హం. 1938లో కెన్యాలో ఆయన జన్మించారు. వ్యవసాయం కుటుంబంలోనే పుట్టి పెరిగారు. అసలు పేరు జేమ్స్ థియోంగో. ఆఫ్రికాలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. తన రచనల ద్వారా ఎంతోమందిలో ఉద్యమ కాంక్ష రగిల్చారు. మావు తిరుగుబాటుతో ప్రభావితమయ్యాడు. కొన్నేండ్లు జైలు జీవితం కూడా గడిపారు. జైల్లో కూడా పుస్తకాలు రాశారు. ఆంగ్లం వద్దని మాతృభాషలో రచనలు రాశారు.
ఆఫ్రికన్లను క్రిస్టియన్స్గా మార్చడానికి నిరసనగా తన పేరు నుంచి జేమ్స్ తీసే...మాతృభాషలో గుగీ వా థియోంగోగా మార్చుకున్నాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేల కోసం, స్వేచ్చ కోసం, జాతుల పోరాటం మీద ఎన్నో రచనలు, ప్రసంగాలు. వా వీప్ నాట్, చైల్డ్ అండ్ పెటల్స్ ఆఫ్ బ్లడ్.. ప్రముఖ రచనలు. న్యూయార్క్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్. నోబుల్ ఫ్రైజ్ రావాల్సిన ఎన్నో రచనలు చేసినా రాలేదు. తన అక్షరాలు ప్రజలను ప్రభావితం చేస్తే చాలు...ఎలా బహుమతులు ఆశించను అన్నడు. ఓసారి హత్య యత్నం కూడా జరిగింది.
డ్రీమ్స్ ఇన్ ఏ టైం ఆఫ్ వార్ పుస్తకాన్ని.. యుద్ధ కాలపు స్వప్నాలు పేరుతో ప్రొఫెసర్ సాయిబాబా అనువదించగా 2018లో హైద్రాబాద్ తెలుగు యూనివర్సిటీలో గూగీ ఆవిష్కరించారు. అలాగే డెవిల్ ఆన్ ది క్రాస్ పుస్తకం మట్టికాళ్ల మహా రాక్షసి పేరుతో అనువాదమయింది. మాగటిగరి, బందీ, ఏడవకు బిడ్డా పుస్తకాలు తెలుగులో అచ్చాయ్యాయి. రెండు సార్లు హైద్రాబాద్ కు వచ్చిన గూగీతో మన అనుభవాలను పంచుకుంటున్నారు సాహితివేత్తలు, అభిమానులు.