- చెక్కును రజినికి అందించిన మంత్రి సబిత
బడంగ్ పేట, వెలుగు : సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున ప్రకటించిన రూ.1 కోటి ఆర్థికసాయం చెక్కును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంద
జేశారు. సోమవారం బడంగ్పేట కార్పొరేషన్ పరిధి గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఇచ్చారు.
మరో రూ. 50 లక్షలు సాయిచంద్ తల్లిదండ్రులకు, సోదరికి అందిస్తున్నట్లు తెలిపారు.భర్తను కోల్పోయిన రజిని బాధ తనకు తెలుసని ఆమెను మంత్రి సబిత ఓదార్చారు. తమ కుటుంబానికి పూర్తి అండగా ఉన్న కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రజిని చెప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు దాసోజు శ్రవణ్, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి ఉన్నారు.