మెదక్ (చేగుంట), వెలుగు: బాకీ డబ్బుల కోసం తోటి కూలిని కొట్టి చంపిన కేసులో నిందితుడిని మెదక్ జిల్లా చేగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ శనివారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. యూపీలోని ఘాజీపూర్కు చెందిన మహమ్మద్ సిరాజ్(30), మహేశ్ కుమార్ బర్మా(23), చేగుంట మండలం అనంతసాగర్ శివారులోని సప్తగిరి ఫార్మా కంపెనీలో కొంతకాలంగా కూలీలుగా చేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నారు. ఈ నెల15న ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో మహేశ్తన బాకీ డబ్బులు రూ. 22 ఇవ్వాలని సిరాజ్ పై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారితీసింది. మహేశ్ కుమార్ కోపంతో సిరాజ్ తలను చింతచెట్టుకు కొట్టి, పెద్దరాయిని తెచ్చి తలపై 4, 5 సార్లు కొట్టి చంపేసి పారిపోయాడు. మృతుడి రూమ్ మేట్ రవి కుమార్ ఫిర్యాదుతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ సీఐ రంగకృష్ణ, చేగుంట ఎస్ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేస్తుండగా.. మాసాయిపేట శివారులోని దాబా వద్ద మహేశ్ కుమార్ యూపీకి పారిపోయేందుకు చూస్తుండగా వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు. సిరాజ్ ను తనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద రక్తపు మరకల దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.
