ప్రజల సమస్యల  పరిష్కారానికే ప్రజా భవన్ : వంశీకృష్ణ

ప్రజల సమస్యల  పరిష్కారానికే ప్రజా భవన్ :  వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ప్రజా భవన్ గా మారుస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో వంశీ కృష్ణ  దంపతులు హోమం నిర్వహించారు. అలాగే అయ్యప్ప, హనుమాన్​ మహా పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​కు ప్రజలు రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవని, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు వీలుగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమయంలో వచ్చినా పరిష్కరించేందుకు ప్రజా భవన్​ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో క్యాంప్​ ఆఫీస్​ ఓ పాలకుడి గడీగా ఉండేదన్నారు. అమ్రాబాద్​ జడ్పీటీసీ అనురాద, మంత్ర్యా నాయక్, గోపాల్​రెడ్డి, గౌరీశంకర్, సునీత, శారద, రాజేందర్, రామనాథం పాల్గొన్నారు.