- రూ.1.50లక్షలు లంచం తీస్కుంటూ దొరికిండు
జీడిమెట్ల, వెలుగు : టీపాయింట్ నిర్వాహకుడి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ నిజాంపేట టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. నిజాంపేటకు చెందిన గొట్టిపాటి శ్రీనివాసులు నాయుడు తన బిల్డింగ్ ముందు టీ–పాయింట్ కంటైనర్, చెన్నపట్నం చీరలు పేరుతో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా బోర్డు, కంటైనర్ ఏర్పాటు చేయకూడదని, తొలగించకుండా ఉండాలంటే రూ. లక్షా యాబై వేలు లంచం ఇవ్వాలని టౌన్ప్లానింగ్ఏసీపీ శ్రీనివాసరావు డిమాండ్చేశాడు.
దీనికి స్థానిక బీఆర్ఎస్ లీడర్ రాములు మధ్యవర్తిగా వ్యవహరించాడు. దీంతో శ్రీనివాసుల నాయుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం బాధితుడి నుంచి రాములు రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీపీ శ్రీనివాసరావు, రాములును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.