
- కోరుట్ల మార్కెట్యార్డులో రైతుల ఆందోళన
- స్థలం సరిపోక ఇబ్బందులు పడతామని ఆవేదన
- నచ్చజెప్పి శంకుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యే
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించొద్దంటూ నిరసన
కోరుట్ల, వెలుగు: కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టవద్దని రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.6 కోట్ల 50 లక్షలతో కొత్తగా ఇంటిగ్రేటెడ్వెజ్, నాజ్వెజ్మార్కెట్నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, కలెక్టర్రవి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అంతకు ముందే వ్యవసాయ మార్కెట్యార్డు దగ్గరకు వచ్చిన కొంతమంది రైతులు నిరసనకు దిగారు. మార్కెట్ యార్డ్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకని..దీనివల్ల భవిష్యత్లో ధాన్యం అమ్మకానికి తీసుకువచ్చినప్పుడు స్థలం సరిపోక ఇబ్బందులు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్అన్నం అనిల్ వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, కలెక్టర్ రవి మొదట ఆందోళన చేసిన రైతులను కలుసుకున్నారు. మార్కెట్లో కొత్త నిర్మాణాల వల్ల స్థలం సరిపోక ఇబ్బందులు వస్తాయని రైతులు వారికి విన్నవించుకున్నారు. కాబట్టి కొత్త నిర్మాణాలు వద్దని వినతిపత్రం ఇచ్చారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు నచ్చజెప్పడంతో శాంతించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్వెజ్, నాజ్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన జరిపారు.