టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. పవిత్రా లోకేష్ను పెళ్లి చేసుకుంటున్నట్లు నరేష్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఇందులో నరేష్, పవిత్ర క్యాండిల్స్ వెలిగిస్తూ కనిపించారు. ఆ తర్వాత పవిత్రా లోకేష్కు నరేష్ లిప్లాక్ ఇచ్చాడు. ‘‘కొత్త ఏడాది.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం’’అని నరేశ్ ట్వీట్ లో రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నరేష్కు ఇది నాలుగో వివాహం కాగా పవిత్రా లోకేష్కు రెండోది. నరేష్ మొదట సీనియర్ సినిమాటోగ్రాఫర్ కూతురుని పెళ్లి చేసుకున్నారు. ఆమెకే నవీన్ విజయ్ కృష్ణ పుట్టారు. ఆ తర్వాత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియని వివాహం చేసుకున్నారు. వీరికీ ఓ కొడుకు ఉన్నారు. ఇద్దరికీ పడకపోవడంతో విడిపోయారు.
ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యరఘుపతిని వివాహం చేసుకున్నారు. వీరికీ ఓ కొడుకు ఉన్నారు. ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు నరేష్. మరోవైపు పవిత్ర లోకేష్ కి కూడా పెళ్లై మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఒక్కటి కాబోతుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది.