పర్సనల్ రివేంజ్ కోసం 15 కోట్లా? ఇది టూ మచ్

పర్సనల్ రివేంజ్ కోసం 15 కోట్లా? ఇది టూ మచ్

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ చూస్తే.. ఇది నరేష్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోందని క్లియర్ గా అర్థమవుతోంది.

ఇక తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నరేష్ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మళ్ళీ పెళ్లి మీ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. “అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే  కథ రిలీవ్ అయినట్లే కదా. అందుకే కథను నేను రివీల్ చేయలేను. సినిమా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇది ఒక యూనిక్ ఫిల్మ్” అని నరేష్ అన్నారు.

ఇక ఈ సినిమాతో మీ మూడో భార్య మీద రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు కూడా నరేష్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. “రివేంజ్ తీర్చుకోవాలి అంటే కత్తులతో పొడుచుకోవాలి. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి. కోర్టులకు పోవాలి కానీ..   సినిమాతో ఏం రివేంజ్ తీర్చుకుంటాం? సినిమా అనేది ఎంటర్ టైన్మెంట్. రూ. 15 కోట్లు ఖర్చు పెట్టి  రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం నేను చేయలేను” అన్నారు నరేష్. ప్రస్తతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.